Asianet News TeluguAsianet News Telugu

పార్టీ గుర్తులు కనిపించడం లేదు.. పోసాని కామెంట్స్!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  తెల్లవారుజాము నుండే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడంతో కోసం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 

posani krishna murali comments on voting
Author
Hyderabad, First Published Dec 7, 2018, 9:05 AM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  తెల్లవారుజాము నుండే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడంతో కోసం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వంటి సీనియర్ హీరోలతోపాటు నితిన్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోలు ఓటు వేశారు. తాజాగా ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

ఓటు హక్కు వాడుకున్న పోసాని.. ఈవీఎంలు చీకట్లో పెట్టారని, ఓటు ఎవరికీ వేయాలో.. ఏ పార్టీ గుర్తు ఎక్కడుందో కనిపించడం లేదని అన్నారు. దీని కారణంగా వృద్ధులు ఇబ్బంది పడతారని అన్నారు. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి!

ఓటేసిన వెంకటేష్, నితిన్!

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios