Asianet News TeluguAsianet News Telugu

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి! (వీడియో)

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు భారీ ఎత్తున ఎన్నికలు జరుగుతున్నాయి. 

megastar chiranjeevi casting his vote
Author
Hyderabad, First Published Dec 7, 2018, 8:51 AM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు భారీ ఎత్తున ఎన్నికలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడంతో కోసం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకొని అభిమానులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు నితిన్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోలు ఓటు వేశారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో సహా జూబ్లిహిల్స్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. రామ్ చరణ్ తప్ప తమ కుటుంబ సభ్యులు అందరూ ఓటు వేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

"

ఓటేసిన వెంకటేష్, నితిన్!

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios