`బాహుబలి`ని ఫాలో అవుతున్న మణిరత్నం.. `పొన్నియిన్ సెల్వన్` టూ పార్ట్స్
`బాహుబలి` రెండు భాగాలుగా రిలీజ్కాగా, `కేజీఎఫ్`, `పుష్ప` వంటి చిత్రాలు రెండు భాగాలుగా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిరత్నం కూడా `పొన్నియిన్ సెల్వన్`ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ హిస్టారికల్ డ్రామా `పొన్నియిన్ సెల్వన్`. భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే `బాహుబలి` రెండు భాగాలుగా రిలీజ్కాగా, `కేజీఎఫ్`, `పుష్ప` వంటి చిత్రాలు రెండు భాగాలుగా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కథ చాలా పెద్దది కావడంతో మణిరత్నం కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. .
తాజాగా ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. `ps-1` 2022 రిలీజ్ అని ప్రకటించారు. స్వర్ణయుగం ప్రాణం పోసుకుంటుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ని పంచుకున్నారు. ఖడ్గం, కవచం, అందులో పులి గర్జించినట్టుగా ఉన్న ఈ కొత్త పోస్టర్ గూస్బమ్స్ తెప్పిస్తుంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. ఇక ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా దూలిపాళ్ల, ప్రకాష్రాజ్, ప్రతిభన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిరత్నం సినిమా అంటే అద్భుత కళాకండంగా ఉంటుంది. ఈ చిత్రం హిస్టారికల్ గా, కాస్ట్యూమ్ డ్రామాగా రూపొందుతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. భారీ విజువల్ వండర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతోంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథనం: జైమోహన్, సంగీతం : ఏ ఆర్ రెహమాన్ , ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్, కళా దర్శకత్వం: తోట తరణి, కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్, నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్, సమర్పణ: సుభాస్కరన్.