బిజినెస్మేన్పై ఛీటింగ్ కేసు పెట్టిన నటి సంజన సోదరి నిక్కీ గల్రాని..
శాండల్వుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్ సంజనా గల్రానీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సోదరి వార్తల్లో నిలిచారు. ఓ బిజినెస్మేన్పై ఆమె ఛీటింగ్ కేసు పెట్టడమే అందుకు కారణం.
శాండల్వుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్ సంజనా గల్రానీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సోదరి వార్తల్లో నిలిచారు. ఓ బిజినెస్మేన్పై ఆమె ఛీటింగ్ కేసు పెట్టడమే అందుకు కారణం. వివరాల్లోకి వెళితే, నిక్కీ గల్రానీ హీరోయిన్గా కన్నడ, తమిళం, తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. కెరీర్ని సాఫీగానే లాగించేస్తుంది. ఈ క్రమంలో ఆమె కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్ పెట్టాలని వ్యాపార వేత్త నిఖిల్ హెగ్డే.. నిక్కీని ఆశ్రయించాడు. అందుకు ఒప్పకున్న నక్కీ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది.
అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతీ నెలా నక్కీకి లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు తనకు ఎలాంటి పేమెంట్ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా నా ఫోన్కాల్స్కు సైతం సమాధానం ఇవ్వడం లేదని పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. కాగా 2014లో సినీ ఇండసస్స్ర్టీలోకి అడుగుపెట్టిన నిక్కీ గల్రానీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో `మలుపు`, `కృష్ణాష్టమి` చిత్రాల్లో నటించింది.