కలిసొచ్చిన డైరెక్టర్ తో వెంకీ మామ కొత్త మూవీ... ఆసక్తి రేపుతున్న అనౌన్స్మెంట్ పోస్టర్!
హీరో వెంకటేష్ కొత్త మూవీ ప్రకటన చేశారు. దిల్ రాజు బ్యానర్ లో కలిసొచ్చిన డైరెక్టర్ తో మూవీకి సిద్దమయ్యాడు. కాగా వెంకీ కొత్త మూవీ ప్రకటన పోస్టర్ ఆకట్టుకుంది.
సైంధవ్ తో సంక్రాంతి బరిలో దిగాడు విక్టరీ వెంకటేష్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వెంకీ 75వ చిత్రంగా సైంధవ్ విడుదల కావడం విశేషం. ఆడియన్స్ కి సైంధవ్ ఏమాత్రం రుచించలేదు. ఈసారి కలిసొచ్చిన దర్శకుడిని నమ్ముకున్నాడు. గత దశాబ్ద కాలంలో ఎఫ్ 2 వెంకటేష్ కెరీర్లో భారీ హిట్ గా ఉంది. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 కలెక్షన్స్ వర్షం కురిపించింది.
దర్శకుడు అనిల్ రావిపూడి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ మరొక హీరో. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించారు. ఇదే కాంబోలో ఎఫ్ 3 సైతం విడుదలైంది. ఎఫ్ 2 స్థాయిలో ఎఫ్ 3 ఆడలేదు. వెంకీ-అనిల్ రావిపూడి హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. దీంతో మరోసారి జతకట్టారు.
దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నేడు వెంకీ 76వ చిత్రం ప్రకటన జరిగింది. అనిల్ రావిపూడి ప్రకటన పోస్టర్ గొప్పగా డిజైన్ చేశాడు. గన్, తాళి బొట్టు, గులాబీ, ఐపీఎస్ పోలీస్ బ్యాడ్జ్ తో కూడిన ప్రకటన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించడం విశేషం.
చిత్రాన్ని వాయు వేగంలో పూర్తి చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ఈ ప్రాజెక్ట్ ని సైతం ఆరు నెలల్లో కంప్లీట్ చేయనున్నాడని సమాచారం. 2024 చివర్లో లేదా 2025 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి అనిల్ రావిపూడి వెంకటేష్ కి సోలో హిట్ ఇస్తాడేమో చూడాలి. అనిల్ రావిపూడి గత చిత్రం భగవంత్ కేసరి మంచి విజయం సాధించింది.