Asianet News TeluguAsianet News Telugu

అభిమానులతో ఛాట్‌ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాగిణి ద్వివేది

రాగిణి ద్వివేది ఎమోషనల్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. డ్రగ్స్ కేసులో సంబంధముందని తేలడంతో సంజనతోపాటు రాగిణి కూడా జైలు పాలైన సంగతి తెలిసిందే.  

actress ragini dwivedi emotional with fans chat arj
Author
Hyderabad, First Published Feb 12, 2021, 1:40 PM IST

ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలై రాగిణి ద్వివేది ఎమోషనల్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. డ్రగ్స్ కేసులో సంబంధముందని తేలడంతో సంజనతోపాటు రాగిణి కూడా జైలు పాలైన సంగతి తెలిసిందే.  145 రోజులపాటు జైల్లో గడిపిన అనంతరం గత నెలలో బెయిల్ మంజూరు కావడంతో రాగిణి బయటకు వచ్చింది. ఇంటికొచ్చాక ఫ్యామిలీతో కలిసి కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంది. 

ఇదిలా ఉంటే గురువారం రాగిణి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ ఛాట్‌ మధ్యలో ఉన్నట్టు ఎమోషనల్‌ అయిపోయింది. తన తనపై ట్రోలింగ్‌ గురించి ఆమె స్పందిస్తూ, `నాపై నా కుటుంబంపై చిల్లర కామెంట్లు చేయడం ద్వారా కొందరు ఎలా ఆనందం పొందుతున్నారో అర్థం కావడం లేదు. నేను వారిని కచ్చితంగా అడుగుతాను. దయజేసి ఒకసారి వెనక్కి వెళ్లి మీరు చేసిన కామెంట్లని చదవండి, మీ కుటుంబ సభ్యులపై ఎవరైనా అలాంటి చీప్‌ కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండని కోరతాను` అని పేర్కొంది. 

ఇంకా చెబుతూ ప్రస్తుతం తాను క్లిష్టమైన దశలో ఉన్నానని, తన సమస్య గురించి ఇప్పుడు వివరించలేనని వెల్లడించింది. కాలం ప్రతి గాయాన్నీ నయం చేస్తుందని నమ్ముతానని, కొంతకాలం తర్వాత దీని గురించి తీరికగా మాట్లాడతానని చెప్పింది రాగిణి. కష్టకాలంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని, అద్భుతమైన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని చెప్పింది. ఆ చేతు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios