సిద్ధిపేట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటనపై తెలంగాణ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన రూ. 5 లక్షలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్ చెరువు కట్ట పై పిడుగు పడి హనుమాన్ నగర్ కి చెందిన పస్తం శ్రీనివాస్ , బాల రాజు అనే ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ సంఘటన పై మంత్రి హరీష్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
జరిగిన సంఘటన దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇ్చచారు. ప్రభుత్వం పక్షాన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.వారి మృతి బాధాకరం వారి మృతి పట్ల సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేసారు.
తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వ వైద్య కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెన్నూరు సారయ్య ను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని అధికారులను ఆదేశించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 6, 2019, 7:26 PM IST