కర్బన ఉద్గారాల నియంత్రణపై ఆటోమొబైల్ మేజర్లు ద్రుష్టి సారిస్తున్నాయి. వచ్చే ఏప్రిల్ నుంచి కర్బన రహిత, పర్యావరణ హిత వాహనాల వినియోగానికే పెద్ద పీట వేస్తుండటంతో తమకు పేరు తెచ్చి పెట్టిన మోడల్ వ్యాన్లు, కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. అందులో మారుతి సుజుకి ఉత్పత్తి జిప్సీ వ్యాన్ ఒకటి. 33 దశాబ్దాలుగా పలు రకాల మోడళ్లతో కారు, వ్యాన్ల ప్రియులను ఆకర్షించిన ‘జిప్సీ’ వ్యాన్ ఉత్పత్తిని నిలిపేసింది. డీలర్లను కూడా బుకింగ్స్ నమోదు చేయవద్దని అధికారికంగా తేల్చి చెప్పింది.