మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మరణించారు. ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
జనసేన చీప్ పవన్ కల్యాణ్ చేసిన డైమండ్ రాణి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ను రోజా పోలిటికల్ జోకర్ గా అభివర్ణించారు. చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయని విమర్శించారు.
చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టిడీపితో పొత్తుకు తాసు సిద్ధంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంకేతాలు ఇచ్చారు. వైసిపిని ఓడించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన చెప్పారు.
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి సోదాలు ముగిశాయి. ఇందుకు సంబంధించి బుధవారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మల్లారెడ్డి ఐటి అధికారులతో వాగ్వాదానికి దిగారు.
టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి కల్వకుంట్ల కవిత గైర్హాజరు కావడంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. కవితను కావాలనే కెసిఆర్ పక్కన పెడుతున్నారనే ప్రచారం అందులో ఒక్కటి.
జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనక బిజెపి పక్కా వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ సిఎం కేసిఆర్ ను ఎదుర్కోవడానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ఆ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు.
ఖండిత శిరస్సులై రాలిపడుతున్నా గుండెను దిటవు చేసుకుని గుట్టుగా దేశం పరువును గుప్పిట పట్టి నిలబడ్డాను అంటూ శిఖామణి రాసిన కవిత " అమృతోత్సవ కల...." ఇక్కడ చదవండి
టిజెఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని బిజెపి నేతలు కోదండరామ్ ను కోరుతున్నారు. కోదండరామ్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
పిఎం నరేంద్ర మోడీకి, టీడీపి అధినేత చంద్రబాబుకు మధ్య తిరిగి స్నేహం చిగురిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమతం నెరవేరేట్లు అనిపిస్తోంది.
హిందూపురం వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కోసం పలువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దాని కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.