టీడీపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ ను తీవ్రంగా తప్పు పట్టారు. దీన్ని బట్టి బిజెపి టీడిపీకి దగ్గరవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
జగన్ నాయకత్వంలోని వైసిపి నుంచి సస్పెన్షన్ కు గురైన తెలుగు సినీ నటుడు పృథ్వీరాజ్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరనున్నారు. నాగబాబుతో భేటీ తర్వాత పృథ్వీరాజ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
తనతో విభేదిస్తూ తనతో సహరించని పార్టీ నేతలను వదిలించుకునే వ్యూహాన్ని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎసరు పెట్టారని అంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కెసిఆర్ టిఆర్ఎస్ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ద్వారా ఈ ఉప ఎన్నిక రానుంది.
రేవంత్ రెడ్డి చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుండు మీద కారం చల్లినట్లయింది. వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాక పుట్టించినట్లు తెలుస్తోంది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తన పార్టీని కూడా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో విలీనం చేస్తారు.
ఏపిలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడానికి సిఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబు కంచుకోట కుప్పంతో తన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు చుక్కలు చూపించడానికి బిజెపి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ బిజెపి గాలం వేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన అమిత్ షాను కలిశారు.