టిడిపి అధినేత చంద్రబాబు ముందు పొత్తు కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చంద్రబాబుకు మింగుడు పడకపోవచ్చు.
కవిత ఈడి విచారణకు గైర్హాజరవుతూ ఈడికి సమాచారం పంపించిన నేపథ్యంలో సోమా భరత్ అకస్మాత్తుగా తెర మీదికి వచ్చారు. కవిత ప్రతినిధిగా వ్యవహరించిన సోమా భరత్ ఎవరనే ఆసక్తి చెలరేగింది. ఆయన నేపథ్యంలో ఏమిటో చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప నటుడని, ఆస్కార్ కు ప్రతిపాదనలు పంపితే ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశ సంపదను మోడీ ఆదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపి బిజెపిలో ముసలం పెట్టినట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో జాతీయ నాయకులు మాట్లాడాలని ఆయన అన్నారు.
అవసరమైతే బిజెపితో తెగదెంపులు చేసుకుని చంద్రబాబు నాయకత్వంలోని టిడిపితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చీఫ్ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. బిజెపి టిడిపితో కలిసి రాకపోతే అదే జరుగుతుందనే సంకేతాలను ఆయన ఇస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ రాజకీయాల్లోకి ఆహ్వానించడం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం ఏమిటనేది తెలియడం లేదు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు తీరు కూడా స్పష్టంగా లేదు.
తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్ నారా చంద్రబాబునాయుడు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేశారు. టిడిపి వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజల అన్నం తినడం ప్రారంభించారనే పద్ధతితో చంద్రబాబు మాట్లాడారు.
కాంగ్రెస్ మధ్య భిన్న వైఖరులు తెలంగాణ సీఎం, బిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య విభేతాలను పెంచినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ ప్లీనరీ తర్వాత నితీష్ కుమార్ చేసిన ప్రకటన అందుకు బీజం వేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు రెండో దెబ్బ తగలింది. అంతకు ముందు మంత్రి సత్యేంద్రజైన్ ను ఈడి అరెస్టు చేయగా, తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది.
అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ పడి నవీన్ అనే మిత్రుడిని హరిహరక్రిష్ణ హత్య చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. నవీన్ ను హత్య చేసిన తర్వాత గుండెను చీల్చాడు, పొట్టను చీల్చాడు, మర్మాంగాన్ని కోసేశాడు.