మోడీ చౌకీదార్ కాదు చోర్ కీ దార్, జగన్ జుట్టు పట్టుకుని ఆడిస్తున్నావ్: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
మోదీ చౌకీదార్ కాదని చోర్ కీ దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా స్వర్ణాంధ్రప్రదేశ్ను స్కామ్ ల ఆంధ్రాగా చెయ్యాలంటే జగన్ కు ఓటెయ్యాలని, స్కీముల ఆంధ్రాగా చెయ్యాలంటే తమకు ఓటెయ్యాలన్న విషయాన్ని గుర్తుకు తెచ్చారు. దేశానికి కాపలాదారుగా చెప్పుకునే మోదీ అవినీతిపరులకు కాపలాకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ చౌకీదార్ కాదని చోర్ కీ దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా స్వర్ణాంధ్రప్రదేశ్ను స్కామ్ ల ఆంధ్రాగా చెయ్యాలంటే జగన్ కు ఓటెయ్యాలని, స్కీముల ఆంధ్రాగా చెయ్యాలంటే తమకు ఓటెయ్యాలన్న విషయాన్ని గుర్తుకు తెచ్చారు.
దేశానికి కాపలాదారుగా చెప్పుకునే మోదీ అవినీతిపరులకు కాపలాకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తో కలిసి ఏపీని స్కామాంధ్రగా చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
వైఎస్ జగన్ అక్రమాలపై ఆనాటి ఈడీ కల్నల్ సీబీఐకు లేఖ రాస్తే దానిపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ను కు మోదీ అండగా ఉంటున్నారంటూ ధ్వజమెత్తారు. అవినీతిపరులకు అండగా ఉంటూ నీతిపరులను వేధిస్తారా అంటూ మండిపడ్డారు. తమను మానసిక క్షోభకు గురి చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.
ఈడీ సీబీఐకు లేఖ రాసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వైఎస్ జగన్ ఆస్తులపై కేసును ఎందుకు పట్టించుకోవడం లేదో దేశవ్యాప్తంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి పరుడైన జగన్ జుట్టు చేత్తో పట్టుకుని ఏపీలో కుట్రలు చేసేందుకు మోదీ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ఫ్యాన్ కంటే కేఏ పాల్ ఫ్యాన్ పవర్ ఫుల్: చంద్రబాబు
జగన్ ను బానిసగా చేసుకుని మా రాష్ట్రంపై పెత్తనం చేస్తే.... : కేసీఆర్ కు చంద్రబాబు వార్నింగ్
జనసేనతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నన్ను దెబ్బకొట్టాలనుకున్నారు, అవకాశంగా మలచుకున్నా : ఎన్నికల షెడ్యూల్ పై చంద్రబాబు
ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు
డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్
నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం