ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్నాథ్ను కలవనున్న వైసీపీ నేతలు
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను ఇవాళ వైసీపీ నేతలు కలవనున్నారు. వైఎస్ జగన్పై దాడి, ప్రభుత్వ వ్యవహారశైలి, శాంతిభద్రతల చర్యలపై వారు రాజ్నాథ్కు వివరించనున్నారు.
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను ఇవాళ వైసీపీ నేతలు కలవనున్నారు. వైఎస్ జగన్పై దాడి, ప్రభుత్వ వ్యవహారశైలి, శాంతిభద్రతల చర్యలపై వారు రాజ్నాథ్కు వివరించనున్నారు.
అత్యంత భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై దాడి నేపథ్యంలో జరిగి విచారణ రాష్ట్ర పోలీసులతో వద్దని.. థర్డ్ పార్టీతో జరిపించాలని వారు రాజ్నాథ్కు విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహారించిన డీజీపీ నేతృత్వంలో ఏర్పాటైన సిట్పై తమకు నమ్మకం లేదని వైసీపీ నేతలు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ వచ్చి.. వీఐపీ లాంజ్లో కూర్చొన్న వైసీపీ అధినేత, వైఎస్ జగన్పై శ్రీనివాసరావు అనే యువకుడు... కత్తితో దాడి చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్
ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ
జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం
ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు
జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్
జగనే కావాలని కత్తితో పొడిపించుకున్నడు... పరిటాల సునీత
జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?
అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు