Asianet News TeluguAsianet News Telugu

విశాఖ నుంచి వందేభారత్ రైలు.. తిరుపతి లేదా విజయవాడ వరకు.. !

‘వందేభారత్’ రైలు విశాఖ నుంచి రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు విశాఖపట్నం నుంచి తిరుపతి లేదా విజయవాడ వరకు ఉండొచ్చని.. ఇంకా మార్గం నిర్ణయం కాలేదని అన్నారు. 

Vande Bharat express train from Visakhapatnam
Author
First Published Nov 15, 2022, 8:33 AM IST

విశాఖ పట్నం : అత్యాధునిక వసతులతో కూడిన ‘వందేభారత్’ రైలు విశాఖ నుంచి రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లు వాల్తేరు డీఆర్ఎం అనూప్ సత్పతి తెలిపారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ ఈ రైలు ఏ మార్గంలో ప్రయాణిస్తుందన్న దాని మీద ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. విశాఖ నుంచి తిరుపతి లేదంటే విజయవాడకు ఉండొచ్చు. ఈ రైలు వేగానికి వీలుగా ప్రస్తుత ట్రాక్ సామర్థ్యం సరిపోతుంది. ఒకసారి ప్రయోగాత్మక పరిశీలన చేయాల్సి ఉంటుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి ఆధునిక వసతులతో ప్రధాన కార్యాలయ భవన నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. 

ఇందుకు రూ. 106కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నాం. డీఆర్ఎం కార్యాలయానికి సమీపంలో వైర్ లెస్ కాలనీలోని 13 ఎకరాల్లో ప్రధాన కార్యాలయాన్ని బహుళ అంతస్తులతో నిర్మించనున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖలోని ముడసర్లోవవద్ద మాకు రావాల్సి స్థలంలా నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది రైల్వేకు వచ్చేసరికి ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఆ స్థలాన్ని ఇతరత్రా రైల్వే అవసరాలకు వినియోగించుకుంటాం’ అని చెప్పారు. 

కాకినాడ : ఇంజనీరింగ్ కాలేజ్‌లో జూనియర్లు , సీనియర్ల ఘర్షణ .. విద్యార్ధులకు గాయాలు

ఇదిలా ఉండగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ (ట్రైన్-18) ఎక్స్ ప్రెస్ తెలంగాణ రాష్ట్రానికి రావడం నవంబర్ 9న దాదాపుగా ఖరారైంది. దక్షిణ మధ్య రైల్వేకు తొలి రైలును రైల్వే బోర్డు కేటాయించినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. Vande bharat expressను సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో నడిపించాలనే విషయంపై రైల్వే బోర్డు కసరత్తులు చేస్తోంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరిగానే కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. 

కాబట్టి ఎక్కువ దూరం..  రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గరిష్టంగా 10 గంటల్లోపే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఉదయమే బయలుదేరి సాయంత్రానికి,  లేదా రాత్రి 9 10 గంటల లోపు గమ్యస్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు,  ముంబై వంటి మార్గాలను పరిశీలిస్తున్నారు. 

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రైలు రిజర్వేషన్ కు గిరాకీ ఉంటుంది. విశాఖ వైపు నిత్యం దాదాపు డజను రైళ్లు ఉన్నా రిజర్వేషన్ అంత సులభంగా దొరకదు. తిరుపతి వెళ్లే వారైతే నెలముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. బెంగళూరుకు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందే చేరుకుంటుండటంతో బస్సు ప్రయాణానికే ఎక్కువమంది ప్రాధాన్యం ఇస్తున్నారు.

చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యే వన్దే భారత్ ఎక్స్ప్రెస్ లకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు నాలుగు పట్టాలెక్కాయి. అయిదోది మైసూర్- బెంగళూరు చెన్నై రైలు ఈనెల 10న చట్టాలు ఎక్కనుంది. దక్షిణ భారతానికి  ఇదే తొలి రైలు. ఆరో వందేభారత్ ఎక్స్ప్రెస్ మాత్రం తెలంగాణకే. ప్రారంభ స్థానం సికింద్రాబాద్ నుంచే అని ఓ అధికారి తెలిపారు రైల్వే బోర్డు అధికారులు సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.

రాష్ట్రం నుంచి బయలుదేరేలా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు  కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల  రైల్వేమంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ ను కలిసి కోరారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి.. లేదంటే విశాఖపట్నానికి నడపాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో ప్రస్తుత ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటి సాంకేతిక, ఆర్థిక అంశాలను రైల్వేబోర్డు అధ్యయనం చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios