ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యం: చంద్రబాబు
ప్రస్తుతం తమ దృష్టి అంతా సార్వత్రిక ఎన్నికలపైనే ఉందని చెప్పుకొచ్చారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో అన్న అంశంపై మాత్రం స్పష్టం చెయ్యలేదు సీఎం చంద్రబాబు నాయుడు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న పట్టభద్రులు, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చెయ్యడం లేదని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తమ దృష్టి అంతా సార్వత్రిక ఎన్నికలపైనే ఉందని చెప్పుకొచ్చారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో అన్న అంశంపై మాత్రం స్పష్టం చెయ్యలేదు సీఎం చంద్రబాబు నాయుడు.