Asianet News TeluguAsianet News Telugu

భీమవరంలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం, ముగ్గురి అరెస్ట్...

మసాజ్ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ, హైదరాబాద్ లకు చెందిన నలుగురు మహిళలను రక్షించారు. 

Prostitution under massage center in Bhimavaram, three arrested
Author
First Published Nov 17, 2022, 8:05 AM IST

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని మసాజ్ సెంటర్లో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను భీమవరం రెండో పట్టణ సీఐ బిజ కృష్ణకుమార్ బుధవారం వెల్లడించారు. పట్టణ పరిధిలో చినఅమిరం వద్ద తమ్మిరాజు నగర్ లో నిర్వహిస్తున్న లావిష్ బ్యూటీ అండ్ స్పాలో వ్యభిచారం జరుపుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ ఆకుల రఘుకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఈ కేంద్రంలో వ్యభిచారం చేయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.

ఈ కేంద్ర నిర్వాహకులైన భీమవరం కొవ్వాడపుంతకు చెందిన యువకుడు ఇంగువ శివసురేష్, విజయవాడకు చెందిన మాంధతి మాధవ్, హైదరాబాదులోని బోరబండకు చెందిన గడ్డం వినోద్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి రూ.96వేల నగదు, 10 సెల్ ఫోన్ లు, కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు అయినా నరసాపురానికి చెందిన సత్యదేవ, విశాఖపట్నం వాసి ప్రతాప్ లను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. తనిఖీల సమయంలో విజయవాడ, హైదరాబాద్ లకు చెందిన నలుగురు మహిళలను గుర్తించి ఆ ముఠా బారి నుంచి రక్షించినట్లు తెలిపారు. 

కాపలాకు వెళ్లిన రైతును కొట్టి, ఎరువుల సంచులు చుట్టి తుప్పల్లో పడేశారు..

ఇదిలా ఉండగా, అక్టోబర్ 18న విజయవాడ నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని వెల్లడించారు. విజయవాడలో  200కు పైగా స్పా, మసాజ్ సెంటర్లు ఉన్నాయని  డీసీపీ తెలిపారు. కొన్ని స్పా, మసాజ్, ఫిట్నెస్, వెల్ నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.  ఆయా సెంటర్లపై వారంరోజులుగా నిఘా పెట్టామని అన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో గతరాత్రి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. 

దివ్య యూనిసెక్స్ యూటీ సెలూన్, గోల్డెన్ కోక్స్, నోవా వెల్ నెస్ ఫిట్ నెస్  సెంటర్లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు.  పూర్తిస్థాయి విచారణ తర్వాత 19 కేంద్రాలను సీజ్ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల  యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని   వివరించారు. వారితో పాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఏడిసిపి కె. శ్రీనివాసరావు, ఏసీపీ ఖాదర్ బాషా పాల్గొన్నారు. విశాల్ గున్ని మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో ఏవైనా అనుమానాస్పద స్పాలు, మసాజ్ సెంటర్లు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను అభ్యర్థించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios