భీమవరం : అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటుచేసిన అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానిని శాలువాతో సత్కరించి ధనుస్సును, జ్ఞాపికను బహూకరించారు. అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని ధనుస్సు పట్టుకుని అందరినీ ఆకట్టుకున్నారు.