ప్రియుడితో రాసలీలలు: వద్దన్న 17 ఏళ్ల కొడుకును చంపిన తల్లి
విజయనగరం జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్లో 17 ఏళ్ల కొడుకును హత్య చేసింది తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా హరిభగవాన్ను హత్య చేసినట్టు ఒప్పుకొందని పోలీసులు తెలిపారు
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్లో 17 ఏళ్ల కొడుకును హత్య చేసింది తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా హరిభగవాన్ను హత్య చేసినట్టు ఒప్పుకొందని పోలీసులు తెలిపారు.
విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత 17 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం విషయమై తల్లితో కొడుకు హరిభగవాన్ వాగ్వావాదానికి దిగేవాడు.ఈ విషయమై తల్లీ, కొడుకు మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు.
హరి భగవాన్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి భావించింది. భోజనంలో నిద్రమాత్రలను కలిపి హరిభగవాన్కు ఇచ్చింది. భోజనం తిన్న తర్వాత హరిభగవాన్ మత్తులోకి జారుకొన్నాడు.
హరిభగవాన్ మత్తులోకి జారుకొన్నాడని నిర్ధారించుకొన్న తర్వాత తన చున్నీతో అతడి గొంతుకు బిగించి హత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె ఒప్పుకొందని పోలీసులు తెలిపారు. అయితే హరిభగవాన్ హత్యలో ప్రియుడి ప్రమేయం కూడ ఉందా లేదా అనే విషయమై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఈ వార్తలు చదవండి
మైనర్ బాలికకు గర్భం: టీచర్ను బట్టలూడదీసీ కొట్టిన స్థానికులు
అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం
ట్రయాంగిల్ లవ్స్టోరీ: మూడో లవర్తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్
వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?
ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త
ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు
భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య
రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు