Asianet News TeluguAsianet News Telugu

వీడు మనిషేనా: మహిళతో వివాహం, ఆమె కూతురిపై ఆరు నెలలుగా రేప్

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యతో విడిపోయి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె కూతురిపై కన్నేసి ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.

Man having relatiionship with a woman, molested her daughter in Nellore district
Author
Venkatagiri, First Published Jul 21, 2021, 7:29 AM IST

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిిన ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. 

వెంకటగిరి మున్సిపాలిటాీ పరిధిలోని దళిత వాడుకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు సంతానంతో అంజయ్య వద్దనే ఉంటోంది. 

కాగా, అంజయ్య ఆమె కూతురిపై కన్నేశాడు. అతను గత ఆరు నెలలుగా ఆమెపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పినా ప్రయోజం దక్కలేదు. గత ఆదివారంనాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసేందుకు అంజయ్య ప్రయత్నించాడు. 

దాన్ని గమనించి బాధిత బాలిక పదేళ్ల సోదరుడు కేకలు వేశాడు. దాంతో స్థానికులు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అంజయ్య ఘాతుకం బయటపడింది. అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక మహిళా సంఘం నాయకురాలు మునేశ్వరి, ఐసిడిఎస్ సీడీపివో జ్యోతి, వలంటీర్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios