Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో పరువుహత్య, కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి...

ప్రేమలో పడిందన్న అనుమానంతో...

honour murder in krishna district

కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరాముడుపాడు లో ఓ తండ్రి తన కన్న కూతురిని గొడ్డలితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... తోటరాములపాడు గ్రామానికి చెందిన చంద్రిక గత కొంత కాలంగా ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుంది. దీంతో ఆమెపై తండ్రి కోటయ్యకు అనుమానం పెరిగింది. ఎవరినో ప్రేమిస్తూ ఆమె అతడితోనే ఫోన్ లో మాట్లాడుతోందని అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ విషయం బైటపడితే తన పరువు పోతుందని బావించాడు. ఈ విషయంపై కూతురిని గట్టిగా హెచ్చరించాడు.

అయితే ఇవాళ చంద్రిక మళ్లీ ఫోన్ లో మాట్లాడడాన్ని కోటయ్య గమనించాడు. దీంతొ తీవ్ర ఆవేశానికి లోనైన అతడు కూతురిపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన చంద్రిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఈ హత్యకు పాల్పడిన యువతి తండ్రి కోటయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios