ధర్మాబాద్ కోర్టులో బాబుకు స్వల్ప ఊరట
బాబ్లీ ప్రాజెక్టు కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడాన్ని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబునాయుడుకు మినహాయింపు ఇచ్చింది
ధర్మాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడాన్ని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబునాయుడుకు మినహాయింపు ఇచ్చింది. చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం నాడు కోర్టు ఈ మినహాయింపు ఇచ్చింది.
బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అక్టోబర్ 15 వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని గత నెల 21వ తేదీన ధర్మాబాద్ కోర్టు ఆాదేశించింది. అయితే ఆ రోజున కూడ కోర్టుకు హాజరుకాకుండా రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబునాయుడు. ఈ రీకాల్ పిటిషన్పై వాదనలను విన్న కోర్టు ఎవరికీ కూడ ప్రత్యేక మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పింది.
అక్టోబర్ 15 వ తేదీన ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే అక్టోబర్ 15 వతేదీన కోర్టుకు హజరయ్యే విషయమై మినహయింపు కోరుతూ చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు అక్టోబర్ 11 వ తేదీన రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రీకాల్ పిటిషన్ పై సుమారు రెండు గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబునాయుడు తరపున సుప్రీంకోర్టు లాయర్ లూత్రా వాదించారు. అక్టోబర్ 15 వతేదీన వ్యక్తిగత హజరు కావడం నుండి చంద్రబాబునాయుడును మినహయించాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ అభ్యర్థనను కోర్టు మన్నించింది. దీంతో అక్టోబర్ 15వ, తేదీన చంద్రబాబునాయుడు ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని కోర్టు మినహాయింపు ఇచ్చింది. సీఎం కావడం వల్ల బాబు కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావడం ఇబ్బందని కోర్టుకు న్యాయవాది వివరించారు. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారంట్ కూడ చంద్రబాబుకు అందలేదని కూడ న్యాయవాదులు వివరించారు.
ఇదిలా ఉంటే నవంబర్ 3వ తేదీన జరిగే విచారణకు హజరుకావాలని కూడ కోర్టు కోరింది. అయితే నవంబర్ 3వ తేదీన కూడ చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా కోర్టుకు హజరుకాకుండా మినహయింపు ఇవ్వాలని న్యాయవాులు కోరారు. కానీ, నవంబర్ 3వ తేదీ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
బాబ్లీ ప్రాజెక్టు సందర్భన కోసం 2010 జూలై 16వ తేదీన వెళ్లిన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన విపక్ష నేత చంద్రబాబునాయుడు సహ పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులను మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై కేసు నమోదైంది.
బాబ్లీ ప్రాజెక్టు సందర్భనకు వచ్చిన చంద్రబాబు సహ పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదైంది. ఈ కేసు విషయమై 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను గత మాసంలో జారీ చేసింది.
2018 సెప్టెంబర్ 21వ తేదీన ధర్మాబాద్ కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది. అయితే ధర్మాబాద్ కోర్టుకు హజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం గంగుల కమలాకర్, ప్రకాష్గౌడ్ లకు కోర్టు సెప్టెంబర్ 21న బెయిల్ మంజూరు చేసింది.అదే రోజున కోర్టుకు హాజరుకాకుండా బాబు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అక్టోబర్ 11వ తేదీన రెండోసారి కూడ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రీకాల్ పిటిషన్ పైనే అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హజరుకాకుండా బాబుకు ధర్మాబాద్ కోర్టు మినహయింపు ఇచ్చింది.
సంబంధిత వార్తలు
బాబ్లీ కేసు: ధర్మాబాద్ కోర్టులో బాబు మరోసారి రీకాల్ పిటిషన్
ధర్మాబాద్ కోర్టుకు గైర్హాజరు: చంద్రబాబు నిర్ణయం
బాబ్లీ కేసు: కోర్టుకి ర్యాలీగా వెళ్దామన్న మంత్రి, ఆలోచిద్దామన్నచంద్రబాబు
బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్
బాబ్లీకేసు: ధర్మాబాద్ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్
బాబ్లీ కేసు: ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్
బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం
బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం
నాన్ బెయిలబుల్ వారంట్పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?
నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి
ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు
అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం
బాబుకు నాన్బెయిలబుల్ వారంట్తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ
బాబుకు నాన్బెయిలబుల్ వారంట్: సీఎస్తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'
బాబుకు నాన్ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం
నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...
బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?
బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు