Published : Apr 26, 2025, 11:20 AM ISTUpdated : Apr 26, 2025, 09:58 PM IST

Telugu news live updates: IPL: పంజాబ్‌ ఓపెనర్ల విధ్వంసం.. కేకేఆర్‌కు భారీ టార్గెట్‌!

సారాంశం

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనగుతోంది. దీంతో పాటు ఈరోజు ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: IPL:  పంజాబ్‌ ఓపెనర్ల విధ్వంసం.. కేకేఆర్‌కు భారీ టార్గెట్‌!

09:58 PM (IST) Apr 26

IPL: పంజాబ్‌ ఓపెనర్ల విధ్వంసం.. కేకేఆర్‌కు భారీ టార్గెట్‌!

IPL: పంజాబ్ కోల్‌కతా మధ్య శనివారం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దమ్మురేపారు. ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కోల్‌కతా నైట్ రైడర్స్‌ బౌలర్లపై తొలి ఓవర్‌ నుంచే విరుచుకుపడ్డారు. ఎడాపెడా సిక్సులు బాదారు. ఇద్దరూ కలిపి తొలి వికెట్‌కు 120 పరుగులు భాగస్వాయంతో పంజాబ్ భారీ స్కోర్‌ సాధించింది. 
 

పూర్తి కథనం చదవండి

09:24 PM (IST) Apr 26

దక్షిణాదిలో వచ్చిన అమీర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రాల రీమేక్ మూవీస్

దిల్, రాజా హిందూస్తానీ, ఇష్క్, సర్ఫరోష్, 3 ఇడియట్స్ వంటి అనేక ఆమిర్ ఖాన్ చిత్రాలు దక్షిణ భారత భాషల్లో రీమేక్ చేయబడ్డాయి. 

పూర్తి కథనం చదవండి

09:12 PM (IST) Apr 26

హృతిక్ రోషన్ 'వార్' మూవీ హీరోయిన్ వాణి కపూర్ ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే

బాలీవుడ్ నటి వాణీ కపూర్ నటించిన బేఫిక్రే, చండీగఢ్ కరే ఆశికీ, బెల్ బాటమ్, షంషేరా, ఖేల్ ఖేల్ మే వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అజయ్ దేవగన్ తో ఆమె నటించనున్న రెయిడ్ 2 సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

పూర్తి కథనం చదవండి

08:38 PM (IST) Apr 26

Moral story: బంగార‌మైనా స‌రే.. అతి ఎప్ప‌టికీ అన‌ర్థ‌మే, ఈ క‌థ అదే చెప్తుంది

క‌థ‌లు మ‌న ఆలోచ‌న విధానాన్ని మార్చేస్తాయి. జీవితానికి కావాల్సిన సందేశాన్ని అందిస్తాయి. అలాంటి ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

08:32 PM (IST) Apr 26

పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని గంగూలీ పిలుపు

పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని మాజీ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇకపై కూడా పాక్ తో భారత్ క్రికెట్ మ్యాచులు నిర్వహించకూడదని సూచించారు. 

పూర్తి కథనం చదవండి

08:28 PM (IST) Apr 26

PM Modi Amaravati Visit:

PM Modi Amaravati Visit:ప్రధాని మోదీ అమరావతి పర్యటను గ్రాండ్‌గా చేయాలని కూటమి ప్రభుత్వం, నాయకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడి ఎఫెక్ట్‌ మోదీ పర్యటనపై పడింది. అయితే.. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి వస్తున్నప్పటికీ పలు కార్యక్రమాలు రద్దు కావడంపై రాజధాని ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏఏ కార్యక్రమాలు రద్దయ్యాయంటే.. 

పూర్తి కథనం చదవండి

08:20 PM (IST) Apr 26

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఏం చేయాలి?

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితిని 2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత పునరాగమనంతో పోల్చారు నితీష్ కుమార్ రెడ్డి పోల్చారు. తొమ్మిది మ్యాచ్‌లలో మూడు విజయాలతో సన్ రైజర్స్ ప్రస్తుతం 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది... అయినా ప్లేఆఫ్ అవకాశాలపై ధీమాతో ఉంది. 

పూర్తి కథనం చదవండి

07:29 PM (IST) Apr 26

AP: లెక్చరర్‌ని చెప్పుతో కొట్టడంపై సీరియస్‌ యాక్షన్‌.. సస్పెండ్‌!

Student Attack on Lecturer:  ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే నేటి తరం విద్యార్థులకు అసలు లెక్కలేదు. వారిపై జోకులు వేయడం, వారి మాట అంటే లెక్కచేయకపోవడం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గారాభంగా పెంచడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. రీసెంట్‌గా విజయనగరంలో జిల్లా బీటెక్‌ విద్యార్థిని లెక్చరర్‌ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం బిగ్‌ ట్విస్ట్‌ జరిగింది. 
 

 

 

పూర్తి కథనం చదవండి

07:26 PM (IST) Apr 26

పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ ... ఇస్లాం మతాన్ని వీడేందుకు సిద్దమైన టీచర్

పహల్గాం ఉగ్రవాద దాడి ఓ ఉపాధ్యాయుడిపై తీవ్ర ప్రభావం చూపింది. మతపరమైన ఈ హింస కారణంగా అతడు తన మతాన్నే మార్చుకోడానికి సిద్దమయ్యారు. 

పూర్తి కథనం చదవండి

07:10 PM (IST) Apr 26

Terror Alert: తెలుగు ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం

క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. అమాయ‌క ప‌ర్యాట‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ ఉగ్ర‌దాడితో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఈ దాడి వెన‌కాల పాకిస్తాన్ ప్రోత్భ‌లం ఉంద‌ని భార‌త్ బ‌లంగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌పై ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. 
 

పూర్తి కథనం చదవండి

07:02 PM (IST) Apr 26

ఇండియా ఈ వెపన్ బయటకు తీసిందో... పాక్ పరుగోపరుగు

 పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ వద్ద S-400 కవచంలా ఉంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

06:26 PM (IST) Apr 26

Bharat Summit 2025 : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత నమ్మకమంటే..: రేవంత్ రెడ్డి

Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ రాజకీయ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు.  శుక్రవారమే ఈ సదస్సు ప్రారంభంకాగా ఇవాళ(శనివారం) కూడా కొనసాగింది. శనివారం హైటెక్స్ లోని నోవాటెల్ లో జరిగిన కార్యక్రమానికి వందకు పైగా దేశాల నుండి 400 పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

పూర్తి కథనం చదవండి

06:23 PM (IST) Apr 26

13 ఏళ్లలో 3 ఫ్లాపులు మాత్రమే, ఈ స్టార్ కూతురు బాక్సాఫీస్ హిట్ మెషీన్.. తెలుగులో ఒకే ఒక్క మూవీతో సంచలనం

బాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం చాలా మంది స్టార్ పిల్లలు అరంగేట్రం చేస్తారు. కొందరు మనుగడ సాగిస్తే, మరికొందరు వెనుదిరిగి చూసుకోవాల్సి వస్తుంది. 13 ఏళ్లుగా హిట్ మెషీన్‌గా ఉన్న స్టార్ కూతురు గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఇప్పటివరకు ఈ స్టార్ కూతురు కేవలం 3 ఫ్లాప్ చిత్రాలను మాత్రమే ఇచ్చింది. ఎవరో తెలుసుకోండి...

పూర్తి కథనం చదవండి

06:13 PM (IST) Apr 26

రాజస్థాన్‌లో 400 మంది పాక్ పౌరులు, గడువు దాటినా వెళ్లకుంటే ఏం చేస్తారు?

పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం అందరు పాకిస్థానీ పౌరులు మే 1 నాటికి దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

05:53 PM (IST) Apr 26

Papaya: ఎండాకాలంలో బొప్పాయి పండు తినొచ్చా?

వేసవిలో శరీరానికి చల్లదనం, శక్తి అవసరం. అందుకే పండ్లు ఎక్కువగా తింటాం. మరి వేసవిలో బొప్పాయి తినొచ్చా? తింటే లాభాలేంటో తెలుసుకుందాం.

 

పూర్తి కథనం చదవండి

05:45 PM (IST) Apr 26

Price Hike: లీటర్ పాలు రూ. 150, నూనె రూ. 500.. ఎక్కడో తెలుసా.? 

ఓ వైపు ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిధులు సమకూరడం లేదు. అప్పులిచ్చే వారు దొరకడం లేదు. అయినా పాకిస్థాన్ మేకపోతు గాంభీరం మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్నీ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటరు పాలు రూ. 150, లీటరు నూనె రూ. 500 దాటేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్థాన్ మాత్రం భారత్ పై ఎదురు దాడికి దిగుతోంది. 

 

పూర్తి కథనం చదవండి

05:31 PM (IST) Apr 26

రాత్రికి రాత్రే స్టార్ హీరో మూవీ నుంచి ఐశ్వర్యారాయ్ అవుట్, షూటింగ్ లో అంత పెద్ద గొడవ జరిగిందా ?

ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్‌తో కలిసి 'మొహబ్బతే', 'జోష్', 'దేవదాస్' వంటి సినిమాల్లో నటించారు. కానీ ఒక సినిమాలో ఒక్క రోజు షూటింగ్ తర్వాత ఐశ్వర్యను రాత్రికి రాత్రే తీసేశారని మీకు తెలుసా?

పూర్తి కథనం చదవండి

05:18 PM (IST) Apr 26

కామెడీ హీరో చేయాల్సిన మూవీ అంటూ చిరంజీవి కామెంట్స్, కట్ చేస్తే ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ అదే

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్షన్ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ కథలు, అడ్వెంచర్ మూవీలు కూడా ఎంచుకున్నారు.ఖైదీ కంటే ముందుగానే చిరంజీవి నటించిన ఒక చిత్రం గోల్డెన్ జూబ్లీగా నిలిచింది.

పూర్తి కథనం చదవండి

05:11 PM (IST) Apr 26

UPSC Civil Services: గొర్రెల కాపర్లు.. పంతంతో సాధించారు సివిల్‌ సర్వీసెస్‌ కొలువులు!

UPSC Civil Services:  కష్టపడితే సాధించలేనిదేదీ లేదని వారు మరోసారి నిరూపించారు. జీవితంలో ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించి తలరాతను మార్చుకున్నారు. గొర్రెల కాపరులే అయినా.. ఆల్‌ ఇండియా లెవల్‌లో జరిగిన సివిల్స్‌ పరీక్షల్లో లక్షలాది మందిని వెనక్కి నెట్టి... కొలువు సాధించారు. 
 

పూర్తి కథనం చదవండి

04:45 PM (IST) Apr 26

పాదయాత్ర నా జీవితాన్న మార్చేసింది... ఎలాగో తెలుసా? : రాహుల్ గాంధీ 

హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2025లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో వస్తున్న మార్పులను, సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ చేపట్టిన పాదయాత్రలో వినడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించానని, ఓ మహిళతో జరిగిన సంఘటన ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని తెలిపారు. నాయకులు ప్రజల మాట వినాలని అన్నారు.

పూర్తి కథనం చదవండి

04:40 PM (IST) Apr 26

Bandar abbas: ఇరాన్‌లో భారీ పేలుడు.. పోర్టులో ఎగిసిప‌డుతోన్న మంట‌లు

దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షహీద్ రాజయీ పోర్టులో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో కనీసం 115 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. 
 

పూర్తి కథనం చదవండి

04:14 PM (IST) Apr 26

DRDO: డీఆర్‌డీవో మిస్సైల్‌ పరీక్ష విజయవంతం... రక్షణ వ్యవస్థ బలోపేతం!

DRDO: ఇండియన్‌ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్క్రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ను 1,000 సెకన్ల నిర్వహించి కీలకమైన టార్గెట్‌ను చేరుకుంది. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో వద్ద సుమారు 1,000 సెకన్లకు పైగా వ్యవధిలో యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పూర్తి కథనం చదవండి

03:59 PM (IST) Apr 26

ముగిసిన పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు.. హాజరైన 164 దేశాల ప్రతినిధులు

కాథలిక్‌ చర్చి మొట్టమొదటి లాటిన్ అమెరికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

 

పూర్తి కథనం చదవండి

03:01 PM (IST) Apr 26

200 కిలో మీట‌ర్లు మైలేజ్‌.. రూ. ల‌క్ష‌లోపు అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. బజాజ్, టీవీఎస్, ఓలా వంటి కంపెనీలు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. లక్ష రూపాయల లోపు అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  
 

పూర్తి కథనం చదవండి

02:48 PM (IST) Apr 26

60 కోట్ల విలువైన RRR నటుడి విలాసవంతమైన ఇల్లు ఇదే, ఫోటోలు చూశారా

అజయ్ దేవగన్, కాజోల్ ముంబైలోని తమ విలాసవంతమైన 'శివశక్తి' ఇంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో స్పైరల్ మెట్లు, స్విమ్మింగ్ పూల్, అందమైన డైనింగ్ ఏరియా మరియు బాల్కనీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ జంట ఇంటి లోపలి ఫోటోలను చూద్దాం.

పూర్తి కథనం చదవండి

02:47 PM (IST) Apr 26

India Pakistan War : భారత్ ముందుగా వాటిని టార్గెట్ చేస్తే చాలు... యుద్దంలో పాకిస్థాన్ ను ఈజీగా ఓడించొచ్చు

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది... ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఇరుదేశాల మధ్య పహల్గాం ఉగ్రదాడి మరింత దూరం పెంచింది... యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. మరి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? భారత్ వ్యూహమేంటి? పాక్ ను దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

01:53 PM (IST) Apr 26

పాకిస్తాన్ వెన్నులో వణుకు. భారత్ ఆయుధ సంపత్తి చూసి గజగజ

భారత సైనిక ఆయుధాలు: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ నిద్ర పోవడం లేదు. కారణం, భారత్ వరుస చర్యలు, యుద్ధ సన్నాహాలు. భారత్ వద్ద క్షిపణులు, డ్రోన్లు,  అత్యాధునిక ఆయుధాలు, యుద్ధనౌకలు ఉన్నాయి. వీటి పరిధిలోకి పాకిస్తాన్ మొత్తం వస్తుంది.

 

పూర్తి కథనం చదవండి

01:40 PM (IST) Apr 26

Donald Trump: కశ్మీర్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంతో పహల్గాం రక్తసిక్తమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. చైనా మొదలు అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలన్నీ ఉగ్రవాదుల చర్యను తప్పు పట్టాయి. 

పూర్తి కథనం చదవండి

01:18 PM (IST) Apr 26

పాకిస్తాన్ వాళ్లను వెనక్కి పంపేస్తున్న భారత్, ప్రయాగ్ రాజ్ నుంచి పాక్ మహిళలు వెనక్కి, వారి వీసాలు రద్దు

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం అన్ని పాకిస్తానీ వీసాలను రద్దు చేసింది. ప్రయాగరాజ్ నుండి పాకిస్తానీ మహిళలను వెనక్కి పంపిస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్యలు కొనసాగుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

01:13 PM (IST) Apr 26

India Pakistan : పాక్ కు కశ్మీర్ జీవనాడి : ప్రధాని షహబాద్ షరీఫ్ సంచలనం

 భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధానా షహబాజ్ షరీఫ్ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పీకలదాక కోపంతో ఉన్న భారత్ ను ఆయన మాటలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.  

 

 

పూర్తి కథనం చదవండి

01:11 PM (IST) Apr 26

Kolleru Encroachments: కొల్లేరుపై సమగ్ర విచారణ చేయండి.. సుప్రీంకోర్టు సీరియస్‌!

Kolleru Encroachments: కొల్లేరు ఆక్రమణలు, ప్రస్తుతం అక్కడి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ చేయాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

పూర్తి కథనం చదవండి

12:50 PM (IST) Apr 26

Operation Kagar : తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్... 28 మంది మావోలు హతం

తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో 'ఆపరేషన్ కగర్'లో భాగంగా భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా, ప్రభుత్వం మాత్రం ఏరివేత కొనసాగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనకు కృతనిశ్చయంతో ఉన్నారు.

పూర్తి కథనం చదవండి

12:19 PM (IST) Apr 26

Pahalgam terror attack: నీచ బుద్ధిని బ‌య‌ట పెట్టిన పాకిస్థాన్‌.. అభినంద‌న్ ఫొటో చూపిస్తూ..

పాకిస్థాన్ తన వంకర బుద్ధిని బయటపెడుతూనే ఉంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ అసలు తీరు క్రమంగా బయటపడుతోంది. పహల్గాం సంఘటన తర్వాత భారతీయులు లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ బయట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. 

పూర్తి కథనం చదవండి

12:18 PM (IST) Apr 26

KTR Alleges CM Revanth: ఆ మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్‌ చేస్తున్నాడు.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు!

KTR Alleges CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్‌కు పదవిగండం ఉన్నందున తన మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రుల ఫోన్లను సీఎం ట్యాప్‌ చేస్తున్నాడని కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఫైర్ అయ్యింది.  

పూర్తి కథనం చదవండి

More Trending News