Asianet News TeluguAsianet News Telugu

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

 రాష్ట్రంలోని 150 పోలింగ్‌స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

Chandrababu Naidu Demands Re-Poll In 150 Booths, Writes To Election Body
Author
Amaravathi, First Published Apr 11, 2019, 6:53 PM IST

అమరావతి: రాష్ట్రంలోని 150 పోలింగ్‌స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

గురువారం నాడు పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించిన కారణంగా ఈ 150 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈవీఎంలు మొరాయించిన కారణంగా పోలింగ్  సమయాన్ని ఇంకా పెంచాలని ఆయన ఈసీని కోరారు. 

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెళ్లిన తన ఓటు హక్కును వినియోగించుకొనే సమయంలో కూడ ఈవీఎం పనిచేయని విషయాన్ని  చంద్రబాబునాయుడు ఈ లేఖలో ప్రస్తావించారు.  ఇదే విషయమై ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలవాలని  భావిస్తున్నారు.

మరో వైపు  వైసీపీ దాడులు, దౌర్జన్యాలపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రౌడీ గ్యాంగ్‌లను రాష్ట్రంపైకి పురికొల్పారని ఆయన  మండిపడ్డారు.
 తాడిపత్రిలో టీడీపీ నేతలను వేట కొడవళ్లతో  నరుకుతారా ,స్పీకర్‌పై కిరాతకంగా దాడి చేస్తారా అని ఆయన  ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యవాదులంతా టీడీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన  కోరారు. ఆళ్లగడ్డ, చీరాల, రాఫ్తాడు, ఆత్మకూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు దాడులకు దిగారని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios