Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు వెడల్పు అంటూ చెట్టును నరికేసిన కాంట్రాక్టర్లు ... ఎన్ని పక్షులు చనిపోయాయో  చూడండి..!

అభివృద్ధి పేరుతో  చెట్లుచేమ‌ల‌ను న‌రికి వేస్తున్నారు. ప‌శుప‌క్ష్యాదుల‌ ఆవాసాల‌ను నాశ‌నం చేస్తున్నారు.

అభివృద్ధి పేరుతో  చెట్లుచేమ‌ల‌ను న‌రికి వేస్తున్నారు. ప‌శుప‌క్ష్యాదుల‌ ఆవాసాల‌ను నాశ‌నం చేస్తున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వందలాది పక్షులు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరురంగడి ప్రాంతంలో జ‌రిగింది. మలప్పురంలో జాతీయ రహదారి-66 అభివృద్ధి ప‌నుల్లో భాగంగా  రోడ్డు ప‌క్క‌న ఉన్న భారీ చెట్లను నరికే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.   మలప్పురంలో  రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో భాగంగా  రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును జేసీబీతో కూల్చివేశారు. అయితే ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్లు కట్టుకుని.. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగాయి. ఒక్క‌సారిగా చెట్టును కూల్చివేయడంతో వందలాది పక్షులు, వాటి పిల్లలు వాటి గూళ్లలో నుంచి  ఎగ‌ర‌లేక‌..నేలకు బలంగా తాకి చనిపోయాయి. కొన్ని పక్షులు ఎగిరి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఆ చెట్టు మీదున్న పక్షుల గూళ్లు కూడా ధ్వంసమయ్యాయి.