Asianet News TeluguAsianet News Telugu

పల్నాడు వైసిపిలో భగ్గమన్న విబేధాలు... క్వారీలో ఇరువర్గాల ఘర్షణ

పల్నాడు జిల్లాలో అధికార వైసిపికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

పల్నాడు జిల్లాలో అధికార వైసిపికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం నడికూడి గుల్ల క్వారీలో పనులు ప్రారంభిస్తూ రమేష్ రెడ్డి భూమి పూజ చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని వడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతితో పాటు ఆమె వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణ స్థాయికి చేరింది. తనపై రమేష్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రేవతి అదే క్వారీలో ఆందోళనకు దిగారు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడినుండి పంపించారు.