Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో మరణించిన జర్నలిస్ట్ మనోజ్.. చివరి చూపులో తల్లి ఆవేదన...

కరోనాతో నిన్న చనిపోయిన మనోజ్ అంత్యక్రియలు ఈ రోజు సైదాబాద్ ఎర్లగుంటలోని స్మశాన వాటికలో జరిగాయి.

కరోనాతో నిన్న చనిపోయిన మనోజ్ అంత్యక్రియలు ఈ రోజు సైదాబాద్ ఎర్లగుంటలోని స్మశాన వాటికలో జరిగాయి. చివరిచూపుకోసం అక్కడికి వచ్చిన మనోజ్, తల్లి, భార్య రోధనలు అందర్నీ కలిచివేశాయి.  ఓ చిన్నా.. నన్నొదిలేసి ఎలా పోతున్నావంటూ ఆ తల్లి రోదనకు ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. మిస్త్రినియా గ్రేవీస్ వ్యాధితో బాధపడుతున్న మనోజ్ కు కరోనా సోకడంతో నాలుగు రోజుల్లోనే చనిపోయాడని వైద్యులు చెబుతున్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మనోజ్ నిన్న ఉదయం చనిపోయిన సంగతి తెలిసిందే.