Asianet News TeluguAsianet News Telugu

స్టార్ డాటర్ నిహారిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్... మొక్క నాటి మట్టిచేతులతో ఫోజులు


హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాగబాబు కూతురు, టాలీవుడ్ యాక్టర్ నిహారిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.


హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాగబాబు కూతురు, టాలీవుడ్ యాక్టర్ నిహారిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కను నాటిన నిహారిక పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడూ ప్రకృతిని ప్రేమించాలని చెబుతుంటారని నిహారిక గుర్తుచేసారు. ప్రకృతినే ప్రత్యక్ష దేవుడిగా భావిస్తానని... ఈ ప్రపంచాన్ని కాపాడే ఈ ప్రకృతి దేవున్ని కాపాడే బాధ్యత మనందరిపై వుందని నిహారిక అన్నారు. 

టీఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాము మొక్కలు నాటడమే కాదు మరికొందరికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసురుతున్నారు. ఇలా అందరినీ మొక్కలునాటే కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ప్రకృతిని కాపాడాలని ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.