Asianet News TeluguAsianet News Telugu

ఆ పనులు ఎంత వేగంగా చేస్తామో చూడండి.. సిరిసిల్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేటీఆర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా లో చేపట్టిన  అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో చేపట్టిన  అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముస్తాబాద్ మండల పరిధిలో తెర్లుమద్ది , హనుమాన్ నగర్ గ్రామాలలో కోటి పదిహేను లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనలను  ప్రారంభించారు.  అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలో  30లక్షలతో నిర్మించిన సెస్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. 19 కోట్లతో నిర్మించిన కొండపూర్ వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం తరువాత సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Video Top Stories