Asianet News TeluguAsianet News Telugu

హన్మకొండలో దారుణం... కళ్లముందే వాగులో కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం

హన్మకొండలో దారుణం... కళ్లముందే వాగులో కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం

వరంగల్ :  తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. వరద నీటితో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు దాటే ప్రయత్నంచేస్తూ కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వాగును కూడా ఉప్పొంగుతూ రోడ్డుపైకి వరద చేరింది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును బైక్ తో సహా దాటడానికి ప్రయత్నిస్తుండగా మహేందర్ అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉదృత ప్రవాహాన్ని దాటిన మహేందర్ మరో రెండు అడుగుల్లో వాగు దాటుతాడనగా ఒక్కసారిగా ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయాడు. అందరి కళ్ల ముందే మహేందర్ వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. 
 

Video Top Stories