Asianet News TeluguAsianet News Telugu

ఐకేపీ ఉద్యోగులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఈటెల

కడ్తాల్ మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న ఐకెపి ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దర్నాలో కూర్చున్నారు. 

కడ్తాల్ మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న ఐకెపి ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దర్నాలో కూర్చున్నారు. వారి డిమాండ్స్ అన్నీ తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 10 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీళ్ళను పట్టించుకోకుండా బిఆర్ఎస్ నాయకులు మాత్రం ఆత్మీయ సభల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు అని ఆక్షేపించారు.