Asianet News TeluguAsianet News Telugu

వీల్ ఛైర్ పై గాంధీ భవన్ కు డీఎస్... ఆత్మీయ ఆలింగనాలతో సీనియర్ల సందడి

హైదరాబాద్ :ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ సొంతగూటికి చేరుకున్నారు. 

హైదరాబాద్ :ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ సొంతగూటికి చేరుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో  ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆధ్వర్యంలో డిఎస్ తో పాటు ఆయన తనయుడు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీల్ ఛైర్ పై గాంధీభవన్  కు చేరుకున్న డిఎస్ కు కాంగ్రెస్ సీనియర్లు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి డిఎస్ ను ఆలింగనం చేసుకున్నారు. మహిళా నాయకురాలు రేణుకా చౌదరి,  మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే అంజన్ కుమార్ యాదవ్ తదితరులు డి శ్రీనివాస్ ను సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానం పలికారు.