Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో కాంగ్రెస్ ఆందోళన... రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపుతూ విద్యుత్ అడిషన్ కంన్సంప్షన్ (ఏసిడి) ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. 

జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపుతూ విద్యుత్ అడిషన్ కంన్సంప్షన్ (ఏసిడి) ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. జగిత్యాల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏసిడి ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలోని తన నివాసం నుండి స్థానిక విద్యుత్ ప్రగతి భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ ఆఫీస్ ముందు బైఠాయించి జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల-కరీంనగర్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.