Asianet News TeluguAsianet News Telugu

ఐదున్నర కోట్ల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటిన్లు..

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గత ఆరేళ్లుగా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించిన జీహెచ్ఎంసీ కార్యక్రమం కరోనా నేపథ్యంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది.

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గత ఆరేళ్లుగా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించిన జీహెచ్ఎంసీ కార్యక్రమం కరోనా నేపథ్యంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటివరకు ఐదున్నరకోట్ల ప్రజలకు ఆహారాన్ని అందించిన ఈ కార్యక్రమం కరోనా లాక్ డౌన్ సమయంలో ఉచిత భోజనవసతిగా మారింది. కరోనాపై తెలంగాణ చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికి 65లక్షల ఉచిత భోజనాలు అందించింది. ఇదంతా అక్షయపాత్ర, ఆ సంస్థ సేవకుల ఘనతే.