Asianet News TeluguAsianet News Telugu

పల్నాడు మహానాడుకు భారీ ఏర్పాట్లు... పరిశీలించిన యరపతినేని, చదలవాడ

నరసరావుపేట : పల్నాడు జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న మహానాడు కోసం టిడిపి ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

నరసరావుపేట : పల్నాడు జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న మహానాడు కోసం టిడిపి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లా కేంద్రం నరసరావుపేట సమీపంలోని ఇస్సాపాలెం వద్ద మహానాడు నిర్వహణకు స్థలాన్ని ఎంపికచేసారు. ఇక్కడ ఇప్పటికే పనులు ప్రారంభంకాగా టీడీపీ నాయకులు యరపతినేని శ్రీనివాస్ రావు, చదలవాడ అరవింద బాబు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ.... పల్నాడు జిల్లా ఏర్పాటు తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి వస్తున్నారని తెలిపారు. కాబట్టి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షన్నర మందికి పైగా జనంతో ఘనంగా నిర్వహించనున్నామని అన్నారు. చెడుపై మంచి విజయం సాదించాలనే దసరా నుంచి మహానాడు పనులకు నాంది పలుకుతున్నామన్నారు.ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ అధికారంలోకి రావడానికి పల్నాటి మహానాడు నాంది కానుందని పేర్కొన్నారు. 2013 లో చంద్రబాబు పల్నాడు నుంచే  ''వస్తున్న మీకోసం'' యాత్ర ప్రారంభించి టిడిపి అధికారంలోకి తెచ్చారని... అదే స్పూర్తితో ఈసారి మాహానాడు కూడా విజయవంతం చేస్తామని టిడిపి నాయకులు పేర్కొన్నారు.