Asianet News TeluguAsianet News Telugu

అవనిగడ్డ దేవాలయాల్లో అంగరంగవైభవంగా రథసప్తమి వేడుకలు

కృష్ణాజిల్లా : మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు రథంపై స్వామి వారు ఊరేగుతున్నారు.

కృష్ణాజిల్లా : మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు రథంపై స్వామి వారు ఊరేగుతున్నారు. స్వామివారి రథోత్సవం దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అవనిగడ్డ గ్రామంలో వేకనూరు గ్రామంలో కొలువై ఉన్న  సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఈరోజు రథసప్తమి పురస్కరించుకుని స్వామివారికి తెల్లవారుజాము నుంచే అభిషేకాలు ఉదయం 11 గంటల వరకు నిర్వహించి అనంతరం స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేద పండితులచే జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. సూర్య కిరణాల దర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.