మంత్రాలయంలో నారా లోకేశ్ .. ఈ గెటప్ లో ఎప్పుడూ చూసి ఉండరు | Asianet News Telugu
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవం, గురు వైభవోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈఉత్సవాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.