Asianet News TeluguAsianet News Telugu

జనసేన జనవాణి కార్యక్రమం ... నేలపై కూర్చుని దివ్యాంగుల నుండి పిర్యాదులు స్వీకరించిన పవన్

విజయవాడ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కానికై ప్రభుత్వంతో పోరాడేందుకు జనసేన పార్టీ 'జనవాణి' కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 

విజయవాడ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కానికై ప్రభుత్వంతో పోరాడేందుకు జనసేన పార్టీ 'జనవాణి' కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఎంబికే భవన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ను కలిసి తమ సమస్యలు తెలియజేసేందుకు భారీగా దివ్యాంగులు వచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగుల వద్దకే వెళ్లిమరీ నేలపై కూర్చుని ఆర్జీలు స్వీకరించారు పవన్ కల్యాణ్. ప్రత్యేక ద్వారం ద్వారా దివ్యాంగులను జనసేన టీం వేదిక వద్దకు తీసుకొచ్చి పవన్ ను కలిపిచ్చారు. 

దివ్యాంగుల బాధలు వర్ణించలేనివని... వారిని కన్న తల్లిదండ్రులు ఎంతో వేదన అనుభవిస్తారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. కాబట్టి ప్రభుత్వమేదైనా వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 
సిఎం సహాయనిధి ద్వారా దివ్యాంగులకు సాయం చేయాలన్నారు.  అలాగే ప్రతి జిల్లాలో రీహాబిలేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలని పవన్ డిమాండ్ చేసారు.