Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన క్యాబినెట్ భేటీ : స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే ఇక అంతే...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. హై కోర్టు ఆదేశాలతో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. క్యాబినెట్ తర్వాత స్థానిక ఎన్నికలపై సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశమయ్యారు.