TDP-Janasena : టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు వేశాయి. ఈ సభ వేదిక పైకి చంద్రబాబు, పవన్ రానుండటం ఇదే తొలిసారి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ సభ ద్వారా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్టు సమాచారం.