మీషో ఈకామర్స్ సంస్థ ఒక రోజు సేల్ ద్వారా 53.5 లక్షల ఆర్డర్లు సాధించి గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్ల వృద్ధి సాధించింది.
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ, మీషో తాము ఆరు లక్షల విక్రేతల రిజిస్ట్రేషన్లను తమ ప్లాట్ఫామ్పై అధిగమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 2021 తరువాత ఏడు రెట్ల వృద్ధిని ఇది నమోదు చేసింది.
మహిళలు, పురుషులు ఎంతో ఇష్టపడే దుస్తులను కొనుగోలు చేసే మీషో యాప్ త్వరలోనే IPOకు రానుంది. ఉత్పత్తి దారులకు, కస్టమర్లకు మధ్య వారధిగా నిలిచే ఈ యాప్ అతి తక్కువ సమయంలోనే దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలను ఢీ కొట్టి పోటీలో నిలిచింది.