ఈ చిన్నారులకు బాట లేదు, బడి లేదు
బడికి వెళ్లేందుకు విద్యార్థుల అవస్థలు
రోడ్డు లేక బుదరలోనే స్కూల్ కు
పక్కా భవనం లేక ఎండలోనే చదువులు
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం గ్రామంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బడికి పోవాలంటే బాటలేదు. బడిలో కుసోని చదువుకుందామంటే చోటులేదు. దీంతో వర్షం వస్తే ఆ బడిలో చదువు ఇక ఆగమేనంటున్నారు.
బురద బాటలో నడిచిపోతే తీరా అక్కడ ఎండలోనే పాఠాలు నేర్చుకోవాల్సివస్తుంది. ఈ ఊరి పాఠశాలకు పక్కా భవనం సాంక్షన్ అయింది కానీ కట్టిస్తలేరు. వెంటనే బడి భవనం కట్టించాలని స్థానిక ఎన్ఎస్ యుఐ నాయకులు కోరుతున్నరు.