09:56 PM (IST) Nov 30

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ ప్రస్తుతం అధికారంలో వుంది. గత ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలను గెలుచుకోగా.. ఈసారి మాత్రం ఈ సంఖ్య 18కి పరిమితమవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ క్రితంసారి మాదిరిగానే 5 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక్కడ అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మరోసారి విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనా వేయగా.. జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం)దే గెలుపని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 

మిజోరంలో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

ఏబీపీ సీ ఓటర్ : ఎంఎన్ఎఫ్ 15 - 21 , జెడ్‌పీఎం 12 - 18, కాంగ్రెస్ 2 - 8
జన్‌కీ బాత్ : ఎంఎన్ఎఫ్ 10 - 14, జెడ్‌పీఎం 15 - 25, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 5 - 9
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ : ఎంఎన్ఎఫ్ 14 -18, జె‌డ్‌పీఎం 12 - 16, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 8 - 10 
పీపుల్స్ పల్స్ సర్వే : ఎంఎన్ఎఫ్ 16 -20, జెడ్‌పీఎం 10 - 14, బీజేపీ 6 - 10, కాంగ్రెస్ 2 - 3
టైమ్స్‌నౌ ఈటీజీ : ఎంఎన్ఎఫ్ 14 - 18, జెడ్‌పీఎం 10 - 14, ఇతరులు 9 - 15

ALso Read: Mizoram Exit polls 2023 : మిజోరంలో మళ్లీ ఎంఎన్ఎఫ్‌దే అధికారం .. బీజేపీ, కాంగ్రెస్‌లకు నిరాశే

08:31 PM (IST) Nov 30

మధ్యప్రదేశ్‌లో విజయం ఎవరిది.. క్లారిటీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలవాల్సి వుంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి విజయం దక్కుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుందని అన్ని సర్వేలు తెలిపాయి. కొన్నింటిలో కాంగ్రెస్, మరికొన్నింటిలో బీజేపీకే అధికారమని తేలింది. నవంబర్ 17న ఒకే దశలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 

మధ్యప్రదేశ్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

పీపుల్స్ పల్స్ : బీజేపీ 91 - 113, కాంగ్రెస్ 117 - 139, ఇతరులు 0 - 8
దైనిక్ భాస్కర్ : బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 105 - 120
జన్‌కీ బాత్ : బీజేపీ 100 - 123, కాంగ్రెస్ 102 - 125, ఇతరులు 0 - 5
మేట్రిజ్ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
రిపబ్లిక్ టీవీ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
పోల్‌స్ట్రాట్ : బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121
న్యూస్ 18 : బీజేపీ 112 , కాంగ్రెస్ 113, ఇతరులు 5
సీఎన్ఎన్ : బీజేపీ 116, కాంగ్రెస్ 111, ఇతరులు 3
న్యూస్24 - టుడేస్ చాణక్య : బీజేపీ 151, కాంగ్రెస్ 74
ఇండియా టుడే : బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121 , ఇతరులు 0 - 6
జీ న్యూస్ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2

ALso Read: Madhya Pradesh Exit polls 2023 : బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. విజయం ఎవరిదో చెప్పని ఎగ్జిట్ పోల్స్

08:30 PM (IST) Nov 30

ఛత్తీస్‌గడ్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!

ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నది.

బఘేల్‌కు మరో టర్మ్?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లలో 68 స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంది. 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వానికి 2018లో కాంగ్రెస్ ఫుల్ స్టాప్ పెట్టింది. భూపేశ్ బఘేల్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కాలంలో భుపేశ్ బఘేల్ ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఓబీసీ ఫేస్‌గా భూపేశ్ బఘేల్ ప్రచారం పొందారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కలిసివచ్చారు. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూపేశ్ బఘేల్ మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నది.

ALso Read: Chhattisgarh Exit Polls: ఛత్తీస్‌గడ్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!

07:39 PM (IST) Nov 30

రాజస్థాన్ బీజేపీదే

వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో రాజస్థాన్‌లో బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

రాజస్థాన్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

దైనిక్ భాస్కర్ : బీజేపీ 98 - 105, కాంగ్రెస్ 85 - 95
పి-మార్క్య్ : బీజేపీ 105 - 125, కాంగ్రెస్ 69 - 91
టైమ్స్‌నౌ ఈటీజీ : బీజేపీ 100 - 128, కాంగ్రెస్ 56 - 72
టీవీ 9 భారత్ వర్ష్ - పోల్‌స్ట్రాట్ : బీజేపీ 100 - 110, కాంగ్రెస్ 90 - 100
జన్‌కీ బాత్ : బీజేపీ 100 - 122, కాంగ్రెస్ 62 - 85, ఇతరులు 14 - 15
రిపబ్లిక్ టీవీ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 2
న్యూస్ 18 : బీజేపీ 111, కాంగ్రెస్ 74, ఇతరులు 14
న్యూస్ నేషన్ : బీజేపీ 89 - 93, కాంగ్రెస్ 99 - 103, ఇతరులు 5 - 9 
ఇండియా టుడే : బీజేపీ 55 - 72, కాంగ్రెస్ 119 - 141, ఇతరులు 4 - 11
పీపుల్స్ పల్స్ సర్వే : బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 73 - 95, ఇతరులు 8 - 11
ఏబీపీ సీఓటర్ : బీజేపీ 94 - 114, కాంగ్రెస్ 71 - 91

ALso REad: Rajasthan Exit Poll 2023 : సెంటిమెంట్ రిపీట్ .. బీజేపీదే అధికారం, రాజస్థాన్‌లో అన్ని సర్వేలదీ ఒకటే మాట

06:52 PM (IST) Nov 30

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ - కాంగ్రెస్ కు 72 స్థానాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 62 నుండి 72 స్థానాలు దక్కే అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది.

కాంగ్రెస్ 62 -72
బీఆర్ఎస్ 35-46
బీజేపీ 03-08
ఎంఐఎం 06-07
ఇతరులు 01-02

ALso Read: Telangana Exit Poll Result 2023: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ లో కాంగ్రెస్ కు 72 స్థానాలు

06:50 PM (IST) Nov 30

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్

రేస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు 48 + or -3 , కాంగ్రెస్‌కు 62 + or -5, బీజేపీకి + or -2, ఎంఐఎం 6 + or - 1, ఇతరులు 1 + or -2 స్థానాలు కైవసం చేసుకుంటారని రేస్ సంస్థ అంచనా వేసింది. 

ALso Read: Telangana Exit Polls 2023 - Race Poll Survey : సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్

06:27 PM (IST) Nov 30

తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’

రాష్ట్రా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 56 సీట్లను గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ 45 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ అనూహ్యంగా ఒక స్థానం నుంచి పది స్థానాలకు పెరుగుతుంది. ఎంఐఎం పార్టీ 8 సీట్లను గెలుచుకుంటుంది. అంతిమంగా ఈ సంస్థ కూడా తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేసింది.

Also Read: Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’.. పుంజుకున్న బీజేపీ

06:26 PM (IST) Nov 30

కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు.. కానీ కింగ్‌మేకర్‌గా బీజేపీ

Jan Ki Baat SURVEY ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ.. బీజేపీ కింగ్ మేకర్‌గా మారే అవకాశాలు వున్నాయని పేర్కొంది. కాంగ్రెస్‌కు 48 నుంచి 64 స్థానాలు, బీఆర్ఎస్‌కు 40 నుంచి 55 సీట్లు, బీజేపీకి 7 నుంచి 13 సీట్లు, ఎంఐఎంకు 4 నుంచి 7 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది. 

Also Read: Telangana Exit Polls 2023 - Jan Ki Baat : కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు.. కానీ కింగ్‌మేకర్‌గా బీజేపీ

06:25 PM (IST) Nov 30

సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ - కాంగ్రెస్ కు 65 స్థానాలు

సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపింది.

కాంగ్రెస్- 65
బీఆర్ఎస్ -41
బీజేపీ- 4
ఎంఐఎం -7

ALso Read: Telangana Exit Poll Result 2023: సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 65 స్థానాలు

05:53 PM (IST) Nov 30

తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ ముందంజ

సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కొత్త రాష్ట్రంలో రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 48 సీట్లతో రెండో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పింది. బీజేపీకి 10 సీట్లు, ఎంఐఎంకు 5 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కాంగ్రెస్ అనూహ్యంగా విజృంభించినా మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ తప్పదని ఈ సర్వే చెప్పింది.

ALso Read: Telangana Exit Polls: తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ విజృంభణ

05:52 PM (IST) Nov 30

కాంగ్రెస్ కు 68 స్థానాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని పోల్ టెండ్ర్స్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే తేల్చి చెప్పింది.
కాంగ్రెస్ కు 65-68
బీఆర్ఎస్ 35-40
బీజేపీ 7-10
ఇతరులకు 6-9
స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 

Also Read: Telangana Exit Poll Result 2023... పోల్ ట్రెండ్స్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ కు 68 స్థానాలు

05:46 PM (IST) Nov 30

తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

డిసెంబర్ 3న తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా జాతీయ మీడియా సంస్థలు, పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తున్నాయి. న్యూస్ 18 సంస్థ తను నిర్వహించిన సర్వే ఫలితాలు విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని తేల్చింది. 

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు :

కాంగ్రెస్ - 56
బీఆర్ఎస్ - 48
బీజేపీ - 10
ఎంఐఎం - 5

05:28 PM (IST) Nov 30

చివరి నిమిషంలో పోటెత్తిన ఓటర్లు.. లాఠీఛార్జ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో వున్న వారికి ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ తండాలోని పోలింగ్ కేంద్రానికి చివరి నిమిషంలో ఓటర్లు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలైన్‌లలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

05:12 PM (IST) Nov 30

చెప్పు చూపించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చెప్పు చూపించడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. 

05:03 PM (IST) Nov 30

ముగిసిన పోలింగ్.. క్యూలైన్‌లో భారీగా ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్‌లలో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

Also Read: Telangana Assembly Elections 2023:ముగిసిన పోలింగ్, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు

04:52 PM (IST) Nov 30

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పీఏపై దాడి

వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్‌లో గురువారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పీఏపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ALso Read: Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ

04:52 PM (IST) Nov 30

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పీఏపై దాడి

వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్‌లో గురువారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పీఏపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ALso Read: Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ

04:50 PM (IST) Nov 30

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన బ్రహ్మానందం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం తన భార్య, కుమారుడితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Scroll to load tweet…
04:45 PM (IST) Nov 30

ఓటేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Scroll to load tweet…
04:34 PM (IST) Nov 30

ఓటు వేయండహో.. దండోరాతో ఓటర్లకు పిలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర ప్రయత్నాలు చేసింది. సెలబ్రెటీలతో ప్రచారంతో పాటు టీవీలు, పత్రికల్లో ప్రకటనలతో పాటు సోషల్ మీడియాలో అవగాహన కల్పించింది. కాగా.. ఓ గ్రామంలో ఓటు వేయాలంటూ ఓ వ్యక్తి దండోరా వేస్తూ చెబుతున్న వీడియోను ఈసీ షేర్ చేసింది. 

Scroll to load tweet…