సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కుటుంబంతో సహా ఓటుహక్కును వినియోగించుుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల వరకే అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి, సతీమణిలతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఇక హీరో వెంకటేష్, కీరవాణిలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామూలుగా పోలింగ్ సమయంలో ఉదయం పదిగంటలు దాటితే కాసీ ఓటింగ్ కు బైటికి రాని సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ సారి ముందుకు వచ్చారు.
Scroll to load tweet…
Scroll to load tweet…
