Telangana Exit Poll Result 2023: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 72 స్థానాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 62 నుండి 72 స్థానాలు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
![Telangana Exit Poll Result 2023: Peoples Pulse Exit Polls 2023 predicts Congress to get 72 Assembly segments lns Telangana Exit Poll Result 2023: Peoples Pulse Exit Polls 2023 predicts Congress to get 72 Assembly segments lns](https://static-ai.asianetnews.com/images/01d8xg16v2yfefh0d5q85avrsn/Congress-Flag_363x203xt.jpg)
హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 62 నుండి 72 స్థానాలు దక్కే అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. గురువారంనాడు సాయంత్రం పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ సర్వే ఫలితాలను వెల్లడించింది.
కాంగ్రెస్ 62 -72
బీఆర్ఎస్ 35-46
బీజేపీ 03-08
ఎంఐఎం 06-07
ఇతరులు 01-02
తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా ముందుకు వెళ్లింది. దక్షిణాదిలో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కమలదళం అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ఫోకస్ పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలు కూడ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
also read:Telangana Exit Poll Result 2023: సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 65 స్థానాలు
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బీఆర్ఎస్ 119 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో తన అభ్యర్ధులను పోటీకి దింపింది. ఒక్క స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయగా, జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది.