తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తికి ఆర్థిక సాయం అందించారు. వైద్య ఖ‌ర్చుల కోసం ఈ మొత్తాన్ని రేవంత్ రెడ్డి స్వ‌యంగా చెక్‌ను అందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు..  

సిద్ధిపేట జిల్లా ఎన్‌సన్‌పల్లికి చెందిన సైరిశిల్ల సాయిచరణ్ (వయసు 35) రక్త క్యాన్సర్ (ఏక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా)తో పోరాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన కుటుంబాన్ని పోషించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెల కోసం సాయిచరణ్ ఇంటివరకు అమ్మి వైద్యం కోసం ఖర్చు పెట్టారు.

అయినప్పటికీ, మెరుగైన చికిత్స చేయించేందుకు ఆర్థికంగా కుదరలేదు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా రూ.5 లక్షల సహాయాన్ని మంజూరు చేశారు. తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్టెం సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ.7 లక్షల ఖర్చు అవుతుందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఆ మొత్తం మంజూరు చేశారు.

Scroll to load tweet…

మే 14 (బుధవారం) completed వైద్యం అనంతరం సాయిచరణ్ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా రూ.7 లక్షల చెక్కును సాయిచరణ్ దంపతులకు అందజేశారు. కుటుంబం ఆర్థికంగా ఆదుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు