కస్టమర్లకు జియో మరో బంపర్ ఆఫర్...100 క్యాష్ బ్యాక్
జియో...టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పేరు. దీని ప్రస్థానమే భారీ ఆఫర్ తో ప్రారంభమయ్యింది. ప్రారంభ ఆఫర్ ముగిసినా వివిధ సందర్భాల్లో విభిన్నమైన ఆపర్లను ప్రకటిస్తూ జియో తమ కస్టమర్లను మరింత పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తమ కస్టమర్లకు జియో భారీ ఆఫర్ ప్రకటించింది.
జియో...టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పేరు. దీని ప్రస్థానమే భారీ ఆఫర్ తో ప్రారంభమయ్యింది. ప్రారంభ ఆఫర్ ముగిసినా వివిధ సందర్భాల్లో విభిన్నమైన ఆపర్లను ప్రకటిస్తూ జియో తమ కస్టమర్లను మరింత పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తమ కస్టమర్లకు జియో భారీ ఆఫర్ ప్రకటించింది.
న్యూ ఇయర్ సందర్భంగా జియో కస్టమర్లకు 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది. అయితే అన్ని రిచార్జులపై ఈ ఆఫర్ వర్తించదని...కేవలం రూ.399 రిచార్జ్ పై మాత్రమే 100శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపింది. ఈ మొత్తాన్ని ఎజియో కూపన్ రూపంలో అందించనున్నారు.
మైజియో యాప్ ద్వారా రిచార్జ్ చేసుకున్న కస్టమర్లకు రూ.399 వెంటనే ఎజియో లో యాడ్ అవుతాయి. ఈ యాప్ ద్వారా కనీసం 1000 రూపాయల షాపింగ్ చేసిన వారు ఈ కూపన్ ను వాడుకోవచ్చు. జియో కస్టమర్లందని ఈ ఆఫర్ వర్తిస్తుందని...జనవరి 31 2019 వరకు ఈ ఆఫర్ అందుబాలుటో ఉంటుందని జియో తెలిపింది.