Asianet News TeluguAsianet News Telugu

5జి సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే.. దేశవ్యాప్తంగా టవర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడి..

కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాచారం ఇస్తూ, BSNL కూడా త్వరలో 5G సేవను రోల్ అవుట్ చేయబోతోంది. దీని కోసం, BSNL టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో కలిసి పని చేస్తుంది ఇంకా దేశవ్యాప్తంగా 1.35 లక్షల టవర్లను ఏర్పాటు చేస్తుంది.

IT Minister told when BSNL's 5G service will start, towers will be installed across the country
Author
First Published Dec 9, 2022, 3:50 PM IST

అక్టోబర్‌ నుంచి ఇండియాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కూడా  ప్రముఖ నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా త్వరలో 5G సర్వీస్ ప్రారంభించబోతోంది. అయితే BSNL కూడా త్వరలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోందని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే,  అప్‌గ్రేడ్ చేయడానికి కనీసం 5 నుండి 7 నెలలు పట్టవచ్చు అని అన్నారు.

కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాచారం ఇస్తూ, BSNL కూడా త్వరలో 5G సేవను రోల్ అవుట్ చేయబోతోంది. దీని కోసం, BSNL టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో కలిసి పని చేస్తుంది ఇంకా దేశవ్యాప్తంగా 1.35 లక్షల టవర్లను ఏర్పాటు చేస్తుంది. వీటన్నింటికీ 5 నుంచి 7 నెలల సమయం పట్టవచ్చు. కేంద్ర మంత్రి వైష్ణవ్ CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కార్యక్రమంలో ఈ విషయం చెప్పారు. 

మారుమూల ప్రాంతాల్లో కూడా 5G 
టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏడాదికి రూ.500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లకు పెంచడం ద్వారా కొత్త స్టార్టప్‌ను ప్రోత్సహిస్తామని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. రాష్ట్ర టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా 5G సేవలు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు 5G సేవల ప్రయోజనాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు.

5G లాంచింగ్ గురించి
ఇండియాలో 5Gని లాంచ్ తరువాత అశ్వనీ వైష్ణవ్ వచ్చే ఏడాది ఆగస్టు 15 నుండి BSNL కూడా 5G సేవలను అందించనున్నట్లు చెప్పారు. రానున్న 6 నెలల్లో 200కి పైగా నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే రాబోయే 2 సంవత్సరాలలో 80-90% వరకు  5G సేవలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అన్నారు. 

రిలయన్స్ జియో అండ్ ఎయిర్‌టెల్
ఇండియాలో 5Gని ప్రారంభించిన తర్వాత, మొదట Airtel అండ్ Jio అన్నీ ప్రముఖ నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్‌టెల్ ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, సిలిగురి, కోల్‌కతా, పాట్నా ఇంకా గురుగ్రామ్‌లలో 5G సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ, ముంబై, పూణే, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, సిలిగురి, కోల్‌కతా, పానిపట్, నాగ్‌పూర్, గురుగ్రామ్ ఇంకా గౌహతిలలో JIO TRUE 5G సేవను ప్రారంభించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios