Asianet News TeluguAsianet News Telugu

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌: వినేష్ ఫోగట్ డబుల్ ధమాకా

టీమిండియా స్టార్ రెజ్లర్ వినేశ్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా ఆమె టోక్యో  ఒలింపిక్స్ 2020 కి కూడా అర్హత సాధించారు.  

Vinesh Phogat wins bronze medal  in world wrestling championship
Author
Hyderabad, First Published Sep 18, 2019, 10:18 PM IST

వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత క్రీడాకారిణి వినేశ్ ఫోగట్ కాంస్య పతకాన్ని  సాధించింది. 53 కిలోల మహిళల విభాగంలో ఫోగట్ 4-1 తేడాతో గ్రీస్ రెజ్లర్  మారియా ప్రివోలరికీ ని చిత్తు చేసింది. దీంతో ఆమె ఖాతాలోకి తొలి వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్ చేరింది. ఈ విజయం ద్వారా ఫోగట్ మరో అరుదైన అవకాశాన్ని పొందింది. జపాన్ రాజధాని టోక్యో వేదికన జరగనున్న ఒలింపిక్స్ 2020 కి ఫోగట్ అర్హత సాధించింది. 

ఈ టోర్నీ ఆరంభం నుండి ఫోగట్ అద్భుత విజయాలను సాధిస్తూ ఈ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. ఫ్రీక్వార్టర్ పైనల్లో అమెరికాకు చెందిన సరా అన్‌ హిల్డర్‌ బ్రాండ్ట్‌ ను అతి సునాయసంగా 8-2 తేడాతో విజయం సాధించి ఫోగట్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 

మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మయు ముకయిద చేతిలో 7–0తో వినేశ్‌ను ఓడిపోయింది. దీంతో టైటిల్‌ రేస్‌ నుంచి నిష్క్రమించినా తాజా విజయంతో కాంస్యాన్ని సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios