అరంగేట్రంలోనే మయాంక్ రికార్డ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ చేశాడు
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ చేశాడు.
95 బంతుల్లో మయాంక్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వారా అరంగేట్రంలోనే అర్థశతకం చేసిన ఏడవ భారత ఓపెనర్గా గుర్తింపు పొందాడు. మయాంక్ కన్నా ముందు శిఖర్ ధావన్, పృథ్వీషా, గవాస్కర్, ఇబ్రహీం, అరుణ్, హుస్సేన్లు ఈ ఘనత అందుకున్నారు.
తొలి టెస్టులోనే అద్భుతంగా రాణించి సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని మాయంక్ నిలబెట్టుకున్నాడు. కాగా, సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మయాంక్ 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
పాక్ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కైఫ్
మళ్లీ టీ20 జట్టులోకి ధోనీ...పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ఆ విషయం కోహ్లీకి బాగా తెలుసు.. అనిల్ కుంబ్లే
నా ఆటోబయోగ్రఫీకి మూలం ‘‘ఆ రోజు ఆ పెద్దాయన మాటలే’’: లక్ష్మణ్
ఆస్ట్రేలియా జట్టులో ప్లేస్ కొట్టేసిన ఏడేళ్ల బాలుడు
కోహ్లీపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అభ్యంతర పోస్ట్.. నెటిజన్ల ఫైర్
పెళ్లి పీటలెక్కిన మరో టీమిండియా క్రికెటర్
కెప్టెన్ దూకుడుగా ఉంటేనేగా టీమ్కు ఊపొచ్చేది: వివ్ రిచర్డ్స్
షాకింగ్ న్యూస్: ధోనికి ఇల్లు లేదట