Asianet News TeluguAsianet News Telugu

క్రీడా ప్రపంచంలో విషాదం... ఇండియా హాకీ లెజెండ్ చరణ్‌జిత్ సింగ్ మరణం...

90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన చరణ్‌జిత్ సింగ్... 1964 టోక్యో ఒలింపిక్స్‌లో చరణ్‌జిత్ సింగ్ కెప్టెన్సీలో స్వర్ణం గెలిచిన భారత హాకీ టీమ్...

Indian Hockey former Captain, Hockey Legend Charanjit Singh dies
Author
India, First Published Jan 27, 2022, 3:27 PM IST

క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. భారత హాకీ లెజెండ్ చరణ్‌జిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. 1931 ఫిబ్రవరి 3న పంజాబ్ రాష్ట్రంలో (ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్) జన్మించిన చరణ్‌జిత్ సింగ్, భారత హాకీ జట్టుకి కెప్టెన్‌గా, ప్లేయర్‌గా భారత హాకీ జట్టుకి సేవలు అందించారు...

90 ఏళ్ల వయసులో హిమాచల్ ప్రదేశ్‌లోని యూనాలోని మైరీ అనే గ్రామంలో గల  తన స్వగ్రామంలో కన్ను మూశారు చరణ్‌ జిత్ సింగ్. 1964 లో జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత హాక జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు చరణ్‌ జిత్ సింగ్...

అలాగే 1960లో రొమ్‌లొ జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు చరణ్ జిత్ సింగ్. 1962లో జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాజీ జట్టు, రజతం సాధించింది. ఆ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు చరణ్‌ జిత్ సింగ్...

హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో గల డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో పని చేశారు చరణ్ జిత్ సింగ్...

చరణ్ జిత్ సింగ్ మృతికి హాకీ ఇండియా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపింది. 1964లో భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల్లో చరణ్ జిత్ సింగ్‌కి ‘పద్మశ్రీ’ అవార్డు దక్కింది.  హాకీ అభిమానులు, క్రీడాకారులు చరణ్‌జిత్ సింగ్ మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు ఘటించారు. 

ఓ రకంగా విశ్వ వేదికపై భారత హాకీ జట్టుకి స్వర్ణ యుగం, చరణ్‌జిత్ సింగ్ కెప్టెన్సీతోనే ముగిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే 1964లో చరణ్‌జిత్ సింగ్ కెప్టెన్సీలో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత మళ్లీ 16 ఏళ్ల పాటు విశ్వ క్రీడల్లో స్వర్ణం సాధించలేకపోయింది భారత హాకీ జట్టు...

మళ్లీ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో వసుదేవన్ భాస్కరన్ కెప్టెన్సీలో చివరిగా స్వర్ణం సాధించింది భారత హాకీ జట్టు. ఆ తర్వాత ఒక్క పతకం సాధించడానికి నాలుగు దశాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 41 ఏళ్లకు 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios